దేశ రాజధాని ఢిల్లీలో కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘనంగానే స్వాగతం పలికారు. డిసెంబర్ 24–31 మధ్య ఈ రాష్ట్రలో ఏకంగా 1.10 కోట్లకు పైగా మందు బాటిళ్ళు అమ్మకాలు జరుపుకోగా.. వీటి ద్వారా రూ.218 కోట్ల ఆదాయం దక్కింది. డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 20.30 లక్షల బాటిళ్ళను మందుబాబులు కొనుగోలు చేశారు. కొత్త సంవత్సరం రోజున ఏకంగా రూ.45.28 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. గతేడాది ఇదే రోజుల్లో కేవలం 13.8 లక్షల లిక్కర్ బాటిల్స్ మాత్రమే ఇక్కడ అమ్ముడుపోయాయి.