ముక్కు పచ్చలారని 10 ఏళ్ళ చిన్నారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది. ముంబైకు చెందిన రిథమ్ మమానియా అనే ఈ బాలిక ప్రస్తుతం రిషికుల్ విద్యాలయలో 5వ తరగతి చదువుతోంది. మే 6న 5,364 మీటర్ల ఎత్తున్న సౌత్ బేస్కు చేరుకున్న ఆమె 11 రోజుల ఈ యాత్రలో ఎట్టకేలకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. ఈ ప్రయాణంలో ఆమెతో వచ్చిన తోటి పర్వతారోహకులు వెనుదిరిగినా చిన్నారి మాత్రం విజయం సాధించింది.