జాతీయ భద్రతకు భంగం కలిగేలా వార్తల్ని ప్రసారం చేస్తున్న 104 యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం కొరడా ఝలిపించింది. ఫేక్ న్యూస్ ను ప్రసారం చేస్తున్నారన్న కారణంతో మరో 45 ప్రైవేటు వీడియోలు, 4 ఫేస్ బుక్, 3 ఇన్ స్టాగ్రామ్, 5 ట్విట్టర్ ఖాతాలతో పాటు 6 వెబ్ సైట్ల నూ బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా ప్రకటించారు. వీటితో పాటు 2021 నుంచి అక్టోబర్ 2022 మధ్య దేశవ్యాప్తంగా 1643 యూఆర్ఎల్స్, వెబ్ పేజీలను బ్లాక్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.