సెనెగల్ దేశంలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన టివయూనే సిటీలోని మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూటే ఈ అగ్నిప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. పిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో అతి కష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.