దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును వేగంగా తరలించేందుకు గానూ రైల్వే శాఖ 1100 ల ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేసింది. దీంతో బొగ్గు రవాణాకు ట్రాఫిక్ అంతరాయం ఉండకుండా చేసి నిరంతర బొగ్గు ఉత్పత్తికి సాయం చేసింది. అంతకు 3 రోజుల ముందు రైల్వే శాఖ 650 సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో మే 24 వరకూ 1100ల ప్యాసింజర్ ట్రైన్ల రద్దు కొనసాగుతుందని చెప్పింది.