తాలిబాన్ దేశం ఆఫ్ఘనిస్థాన్లో బుధవారం వరుస పేలుళ్ళు సంభవించాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. బుధవారం ఒక మినీ బస్సుతో పాటు మజారే షరీఫ్ ప్రాంతంలోని మసీదుతో పాటు కాబూల్లోని మరో సమీదులోనూ ఈ వరుస పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. మసీదు లోపల ఉన్న ఫ్యాన్లో బాంబు పెట్టినట్లు అధికారులు చెప్పారు.