బీహార్​: భక్తులపైకి దూసుకొచ్చిన లారీ.. 12 మంది మృతి

By udayam on November 21st / 10:45 am IST

ఓ హైవే పక్కన పూజలు చేస్తున్న భక్తులపైకి లారీ దూసుకొచ్చిన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. బీహార్​ లోని వైశాలీ జిల్లా దేస్రీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హాజీపూర్​–మహ్నార్​ రోడ్డు పక్కన ఉన్న ఆలయంలో గ్రామస్థులు పూజలు చేస్తున్న క్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిలో కొందరికి తీవ్ర గాయాలు కాగా వారికి చికిత్స కొనసాగుతోంది.

ట్యాగ్స్​