మలేషియా లోని కౌలాలంపూర్ లో కొండ చరియలు విరిగిపడి 12 మంది మరణించారు. మరో 59 మందిని సురక్షితంగా కాపాడారు. మరో 22 మంది ఆచూకీ గల్లంతైన ఈ ఘటన కౌలాలంపూర్ శివార్లలోని క్యాంప్ సైట్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగే సమయంలో క్యాంప్ సైట్ లో మొత్తం 90 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో 8 మందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.