పరీక్ష ముగించుకుని ఇంటికి తిరిగొస్తున్న 12 ఏళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసి 2 రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన రాజస్థాన్లో జరిగింది. ఈ ఘటనలో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పరీక్ష ముగించిన అనంతరం ఇంట్లోకి కావాల్సిన సామాన్ల కోసం బాలిక కిరాణా షాపుకు వెళ్ళిన క్రమంలో దుండగులు బాలికను కిడ్నాప్ చేశారు. దీంతో నిందితుడి ఇంటి వద్ద బాలిక తల్లిదండ్రులు గొడవ చేయగా.. 2 రోజుల తర్వాత బాలికను వదిలిపెట్టారు.