గుజరాత్లోని మోర్చి జిల్లా హల్వాద్ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. వీరు పనిచేస్తున్న ఉప్పు ఫ్యాక్టరీ గోడ కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల్లో మరో 30 మందికి పైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. శరవేగంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. కూలీలంతా గోడ పక్కనే కూర్చుని మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.