విశాఖలోని అచ్యుతాపురం సెజ్లో అమ్మోనియా గ్యాస్ లీకై ఆసుపత్రిపాలైన వారి సంఖ్య 140కు చేరింది. పోరస్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి లీకైన ఈ గ్యాస్ను పీల్చడంతో అక్కడ పనిచేస్తున్న 140 మంది వర్కర్లకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చాలా మందికి వాంతులు అవ్వడంతో పాటు కళ్ళు మండడం వంటి లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు.
gas leak at Brandix SEZ at Achyutapuram in #Anakapalli district. Staff complain of nausea vomitting. Dist officials rush then to hospital#Vizag #AndhraPradesh #gasleak pic.twitter.com/tmmNcpoJBe
— PN.Harini (@PN_Harini) June 3, 2022