ఇటీవల యాంటీ టెర్రరిజం స్వ్కాడ్కు చిక్కిన డ్రగ్ పెడ్లర్ హైదర్ నుంచి మరో 900 కోట్ల రూపాయల విలువైన నార్కోటిక్స్ను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 27న అతడిని గుజరాత్ పోలీసులు యుపిలోని షాహీన్బాగ్ వద్ద అరెస్ట్ చేసిన క్రమంలో 97 కేజీల టాప్ క్వాలిటీ హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై అతడిని విచారించిన అనంతరం సోమవారం మరో 150 కేజీల విలువైన హెరాయిన్ (బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.900 కోట్లు) ను స్వాధీనం చేసుకున్నారు.