ఉత్తర సిక్కింలో చైనా సరిహద్దులకు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. 20 మంది జవాన్లతో వెళ్తున్న మిలటరీ ట్రక్కు లోయలో పడిపోయిన ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. వారిలో 13 మంది జవాన్లు కాగా, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు ఉన్నారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని హెలికాప్టర్ లో బెంగాల్ లోని ఆసుపత్రికి తరలించారు. ఓ మలుపు వద్ద వాహనం వీరి వాహనం 100 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పడి నుజ్జునుజ్జయింది. ఈ విషాద ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
सेना का ट्रक तीन वाहनों के काफिले का हिस्सा था। जो चतेन से थांगू की ओर जा रहा था। जेमा के रास्ते में वाहन एक तीखे मोड़ पर फिसल गया और सीधे खाई में जा गिरा। हादसे में 3 जूनियर कमीशंड अधिकारियों और 13 सैनिकों की मौत हो गई। घायलों को एयरलिफ्ट किया गया है। #sikkim #indianarmy pic.twitter.com/79sirU98PF
— Rahul Ahir (@rahulahir) December 23, 2022