ఉత్తర ప్రదేశ్ నుంచి పుణె వచ్చి చదువుకుంటున్న 17 ఏళ్ళ చిన్నారిపై అంకుల్, తాత అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని లేఖలో తండ్రికి రాస్తే.. అతడు సైతం ఆమెను ఇంటికి పిలిచి తల్లి లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇక ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఆ చిన్నారి సెక్స్యువల్ దాడుల నుంచి ఎలా బయటపడాలని స్కూలులో జరుగుతున్న సెమినార్ లో తనకు జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు వెల్లడించింది. దీంతో స్కూలు యాజమాన్యం చిన్నారితో సహా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అంకుల్, తాత, తండ్రిని అరెస్ట్ చేశారు.