తొలి టెస్ట్ లో భారత్ 513 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ కు నిర్దేశించింది.ఈరోజు తొలి సెషన్లోనే బంగ్లాను 150 కు ఆలౌట్ చేసిన భారత్.. ఆపై 258/2 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది. శుభ్ మన్ గిల్ 110 ఔట్ కాగా.. పుజారా తన కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ 102 (130 బాల్స్)లో చేశాడు. అతడికి విరాట్ కోహ్లీ 19 నాటౌట్ గా ఉండి సహకరించాడు. పుజారా ఇన్నింగ్స్ తో భారత్ ఆధిక్యం 500 రన్స్ దాటేసింది. ఈరోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేశారు. విజయం కోసం బంగ్లా ఇంకా 471 పరుగులు చేయాల్సి ఉంది.