పాక్​లో ఇద్దరు సిక్కుల దారుణ హత్య

By udayam on May 16th / 6:28 am IST

పాకిస్థాన్​లోని సర్బాంద్​ నగరంలో నివసిస్తున్న సల్జీత్​ సింగ్​ (42), రంజీత్​ సింగ్​ (38)లను దుండగులు కాల్చి చంపారు. వీరి హత్యను భారత్​ ఖండించింది. అక్కడి బాబా తాల్​ బజార్​లో దుకాణం నిర్వహిస్తున్న వీరిద్దరిపై బైక్​పై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీంట్లో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పాకిస్థాన్​ అనుమానిస్తోంది. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు ఉంటాయని ఖైబర్​ పఖ్తుంఖ్వా సిఎం మహమ్మూద్​ ఖాన్​ పేర్కొన్నారు.

ట్యాగ్స్​