ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్-16కు సంబంధించిన మినీ వేలం కొచ్చి వేదికగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 నుంచి జరగనుంది. లీగ్ లోని 10 ఫ్రాంఛైజీలు తమకు అవసరమైన ఆటగాళ్ళ కోసం వేలాన్ని జరపనున్నాయి. 87మంది ఆటగాళ్ల కోసం 405 మంది దేశీయ, అంతర్జాతీయ ప్లేయర్లు రేసులో ఉన్నారు. ఇందులో 273మంది భారత క్రికెటర్లు ఉండగా.. మరో 132మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఈ మినీ వేలంలో మొత్తం అన్ని జట్లూ కలిపి రూ.206.5 కోట్లు ఖర్చు చేయనున్నాయి. హైదరాబాద్ వద్ద అత్యధికంగా రూ.42.25 కోట్లు ఉంటే.. కోల్ కతా వద్ద అత్యల్పంగా రూ.7.05 కోట్లు మాత్రమే ఉన్నాయి.