రాజస్థాన్లోని భిల్వారా ప్రాంతంలో 22 ఏళ్ళ యువకుడి హత్య ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ హత్యలో ఆ యువకుడిపై కత్తులతో దాడి శత్రువులు చంపేశారు. దీంతో చెలరేగిన ఉద్రిక్తతల పట్ల అప్రమత్తమైన పోలీసు శాఖ ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను గురువారం వరకూ బంద్ చేశాయి. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు గురైన వ్యక్తి గత వారం ఓ బైక్కు నిప్పుపెట్టడంతో ఈ గొడవలు మొదలయ్యాయని తెలిపారు.