లారీ నుంచి ఓ భారీ సైజు గ్రానైట్ రాయి ఆటో మీద పడ్డ ఘటనలో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. బానోత్ సుమన్, శ్రీకాంత్ అనే వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రానైట్ లారీ ఖమ్మం వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదకరంగా తీసుకు వెళుతూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముంది.