మదన సుందర్ గౌడ్ అనే వ్యక్తి తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా ఎంపిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ 2019లో కోర్టుకెక్కిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ముగ్గురు ఐఎఎస్ అధికారులకు జైలు శిక్షలు విధించింది. కోర్టు ధిక్కరణ కింద వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ మాజీ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్లకు జస్టిస్ బట్టు దేవానంద్.. 30 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించారు.