భారీ ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు పాకిస్థాన్ టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరంతా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దాటి ఉత్తర కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. గురువారం జరిగిన ఈ ఎన్కౌంటర్ అనంతరం లష్కరే ఈ తోయిబా తీవ్రవాద సంస్థకు మద్దతు తెలుపుతూ స్లోగన్లు పలుకుతున్న మరో 10 మంది యువకులను సైతం శ్రీనగర్లో అరెస్ట్ చేసింది.