విశాఖపట్నం జిల్లాలోని అచ్యుతాపురం వద్ద ఉన్న పోరస్ లాబొరేటరీస్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడడంతో 30 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు. వీరందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారని ఎస్పీ గౌతమి సాలి ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఏలూరులోని పోరస్ లాబొరేటరీస్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.