పర్యాటకులో వెళ్తున్న ఓ ప్రయాణికుల వాహనం హిమాచల్ ప్రదేశ్లోని కుల్లు జిల్లాలో లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు పర్యాటకులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. బంజర్–జలోరి–జాట్ రోడ్లోని ఘియాగి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో గాయడపడ్డ వారిని తక్షనం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఎస్యువి వాహనం అదుపు తప్పి ఇలా లోయలోకి జారుకుందని పోలీసులు తెలిపారు. మరణించిన ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.