ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో జరుగుతున్న ఓ వివాహానికి వెళ్తున్న నలుగురు విశాఖ వాసులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఖుర్దా జాతీయ రహదారి మీద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో మారియా ఖాన్(24), రాఖీ(45), కబీర్లతోపాటు మరొక వ్యక్తి చనిపోయారు. మృతుల్లో మారియా ఖాన్, బీచ్ రోడ్ ప్రాంతానికి చెందినవారు కాగా రాఖీది విశాలాక్షి నగర్. కబీర్ ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నారు.