రాజ్యసభకు వైకాపా సభ్యులు ఏకగ్రీవం

By udayam on June 4th / 4:56 am IST

రాజ్యసభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ ప్రతిపాదించిన నలుగురు సభ్యులు ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవమయ్యారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ ముకేష్​ కుమార్​ మీనా ఈ మేరకు ప్రకటన చేశారు. శుక్రవారమే నామినేషన్ల విత్​డ్రాకు చివరి రోజు కావడంతో అప్పటికి కేవలం 4 నామినేషన్లే ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. దీంతో వి.విజయసాయి రెడ్డి, బీద మస్తాన్​ రావు, ఆర్​.కృష్ణయ్య, ఎస్​.నిరంజన్​రెడ్డిలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎంపికయ్యారు.

ట్యాగ్స్​