కడలూరు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By udayam on January 3rd / 5:58 am IST

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయి. రెండు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఢీకొన్నాయి. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. కడలూరు తురుచ్చి నేషనల్‌ హైవేపై వేప్పర్‌ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్​