మహారాష్ట్రలోని పూణెలో బ్రేకులు ఫెయిలైన ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బయల్దేరిన ఈ లారీ నవాలే వంతెన వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అతి వేగంతో పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ క్రమంలో దాదాపు 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. పుణె ఫైర్ బ్రిగేడ్, పుణె మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ రెస్క్యూ టీమ్ లు క్షతగాత్రులను హుటాహుతిన ఆసుపత్రికి తరలించాయి. ఈ యాక్సిడెంట్ కారణంగా ముంబై రహదారిపై 2 కి.మీ.ల మేర ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోయింది.
On Mumbai-Pune Expressway car rams into truck, 5 killed on the spot; 4 others critical@MumbaiPolice @PuneCityPolice @CPPuneCity @MTPHereToHelp https://t.co/0yufcO32eu#puneroadaccident #Mumbai #MumbaiPuneHighway #HighWay #pune #punenews #mumbainews pic.twitter.com/wwEaYsX3Wu
— Free Press Journal (@fpjindia) November 18, 2022