పాకిస్థాన్ లోని వివాదాస్పద బలూచిస్థాన్ ప్రావిన్స్ లో ఆదివారం జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో ఐదుగురు పాకిస్థాన్ జవాన్లు మృతి చెందారు. మరో 12 మంది పౌరులు గాయపడ్డారు. డిసెంబరు 24 నుంచి బలూచిస్థాన్లో పాక్ ఆర్మీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం శక్తిమంతమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ ను పాక్ సైనికులే లక్ష్యంగా ఆందోళనకారులు పేల్చారు. మరోవైపు, క్వెట్టాలోని శాటిలైట్ టౌన్లో ఉన్న పోలీస్ చెక్ పోస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు.