ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. టాటా ఏస్ను లారీ గుద్దేసిన ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. రెంటచింతల పవర్ ప్లాంట్కు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మృతులు ప్రయాణిస్తున్న వాహనం శ్రీశైలం నుంచి వస్తోందని, అందులో మొత్తం 38 మంది ప్యాసింజర్లు ఉన్నారని తెలిపారు. క్షతగాత్రులను గుజరాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.