హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేటు లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి 7 గురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. కర్ణాటకలోని కలబురాగి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో 12 మంది ప్రయాణికులకు కాలిన గాయాలవ్వడంతో వారిని కలబురాగిలోని ఆసుపత్రికి తరలించారు. మంటలు అంటుకున్న బస్సులో చిక్కుకుపోయిన ఏడుగురు ప్రయాణికులు బయటకు రాలేక మంటల్లో కాలిపోయారని కలబురాగి జిల్లా ఎస్పీ ఇషా పంత్ తెలిపారు.