ఢిల్లీ నుంచి వస్తున్న ఓ అంబులెన్స్ను ట్రక్ గుద్దిన ఘటనలో 7 గురు దుర్మరణం చెందారు. ఫతేహ్గంజ్ పశ్చిమ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ అతి వేగంతో బండిపై కంట్రోల్ పోగొట్టుకుని డివైడర్ను గుద్ది అవతల రోడ్డులో వెళ్తున్న ట్రక్ను ఢీకొట్టాడు. దీంతో 7 గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారని బరేలీ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అంబులెన్స్ డ్రైవర్ తాగి ఉన్నాడేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.