నదిలో పడ్డ ఆర్మీ వాహనం.. 7 గురు జవాన్లు మృతి

By udayam on May 27th / 1:38 pm IST

లడఖ్​ లోని తుర్​తుక్​ సెక్టార్​ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారత జవాన్లు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పై జారిపోయి పక్కనే ఉన్న ష్యోంక్​ నదిలోకి దూసుకుపోయింది. ఈ సమయంలో 26 మంది జవాన్లు హనీఫ్​ సబ్​ సెక్టార్​లోని పర్తాపూర్​కు వెళ్తున్నట్లు ఆర్మీ ప్రకటించింది. మరో 10 మందికి పైగా జవాన్లు గాయపడ్డట్లు ఆర్మీ వెల్లడించింది.

ట్యాగ్స్​