దేశంలోని 71 శాతం ప్రజలు బలవర్ధక ఆహారానికి దూరంగా ఉంటున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సర్వేలో తేలింది. ఆరోగ్యకరమైన ఆహారం అందకపోవడంతో ప్రతీ ఏటా 17 లక్షల మంది భారతీయులు మరణిస్తున్నారని బయటపెట్టింది. దీని కారణంగా డయాబెటీస్, క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్స్ వస్తున్నట్లు పేర్కొంది. పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్, మాంసంను ఏడాదిలో ఒక్కసారి కూడా కొంతమంది తినలేకపోతున్నారని పేర్కొంది.