లోయలో పడ్డ క్యాబ్​.. 9 మంది దుర్మరణం

By udayam on May 26th / 10:28 am IST

జమ్మూ కశ్మీర్​లో గురువారం తెల్లవారుఝామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఆర్మీ అధికారి సైతం ఉన్నారు. శ్రీనగర్​–లేహ్​ జాతీయ రహదారిపై వెళ్తున్న వీరి క్యాబ్​ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో క్యాబ్​ కార్గిల్​ నుంచి శ్రీనగర్​ వెళ్తున్నట్లు ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 5 గురిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్​