జీరో కొవిడ్ పాలసీని సడలించిన చైనాలో రోజుకు 10 లక్షల కేసులు, 5 వేల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని లండన్ ఎయిర్ఫినిటీ లిమిటెడ్ సంస్థ తన నివేదికలో హెచ్చరించింది.జనవరిలో రోజుకు గరిష్ఠంగా 37 లక్షల కేసులు నమోదుకావొచ్చని, మార్చినాటికి ఇది 42 లక్షల పెరుగొచ్చని అంచనావేసింది. చైనాలో బుధవారం 2,966 కొత్త కేసులు నమోదయ్యాయని, 10 మంది మరణించారని ప్రభుత్వం చెప్పగా.. వాస్తవానికి ఈ సంఖ్య భారీ స్థాయిలో ఉందని ఈ కంపెనీ పేర్కొంది. ఆసుపత్రుల్లో రోగులకు బెడ్ లు కూడా దొరకని పరిస్థితి ఉందని తెలిపింది.