ఎపిలో సినిమా టికెట్లను అమ్మేందుకు ప్రభుత్వం యువర్ స్క్రీన్ అనే పోర్టల్ను త్వరలోనే ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్, ధియేటర్ డెవలప్మెంట్కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఈ వెబ్సైట్ ద్వారా కేవలం రూ.1.95 లను మాత్రమే ప్లాట్ఫామ్ ఛార్జ్గా వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే ధియేటర్ యాజమాన్యాలు 50 శాతం టికెట్లు అమ్ముకోవడానికి అనుమతి ఉందని, మిగతా టికెట్లను మాత్రమే పోర్టల్లో అమ్ముతామని కార్పొరేషన్ ఎండి టి.విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు.