ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ విధానంలో సినిమా టికెట్ల విక్రయాలను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. సర్వీస్ ఛార్జ్ ఒక్కో టికెట్పై గరిష్ఠంగా 2 శాతానికి మించకూడదని పేర్కొంది. దీంతో పాటు ఈ ఆన్లైన్ టికెట్ల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ఫిలిమ్, టెలివిజన్, ధియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కట్టబెట్టింది. ఇందుకు గానూ ఎపి సినిమా నియామవళి–1970ను సవరిస్తూ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.