టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణిస్తే మన దేశంలో ఫైనా లేదా జైలు శిక్షలూ పడుతుంటాయి. అయితే మన దేశంలోనే ప్రయాణిస్తున్న ఓ ట్రైన్ మాత్రం 73 ఏళ్ళుగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న విషయం మనలో చాలా మందికి తెలియదు. 1948లో ప్రారంభమైన భకర్–నాంగల్ ట్రైన్ ప్రయాణికుల నుంచి రూపాయి కూడా వసూలు చేయదు. పంజాబ్–హిమాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద 13 కి.మీ.లు ప్రయాణించే ఈ ట్రైన్కు గంటకు 20 లీటర్ల డీజిల్ ఖర్చవుతున్నా టికెట్ ఛార్జీలు మాత్రం పెట్టలేదు.