ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్ పై సొంత పార్టీ కార్యకర్తలే చెప్పులతో తిరగబడ్డారు. ఈ హఠాత్ పరిణామానికి తేరుకుని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ చెప్పులతో కొట్టారు. దాడి ఎందుకు జరిగిందనే విషయంపై ఆప్ వర్గాల నుంచి స్పష్టత లేదు. అయితే, ఢిల్లీలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆప్ నేతలు పార్టీ టికెట్లను అమ్మకానికి పెట్టారని, అది సహించలేకే మాటియాలా నియోజకవర్గం ఎమ్మెల్యే గులాబ్ సింగ్ ను కార్యకర్తలు కొట్టారని చెబుతున్నారు.
Unprecedented scenes from the party that indulged in the theatrical drama of ‘honest politics’.
Such is AAP’s corruption that even their members are not sparing their MLAs!
A similar outcome awaits them in upcoming MCD polls. pic.twitter.com/ig9rKuKl82
— Sambit Patra (@sambitswaraj) November 21, 2022