దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల మోత మోగుతోంది. నిన్న షాహీన్బాగ్లో అక్రమ కట్టడాలపై దూసుకెళ్ళిన బుల్డోజర్లు నేడు మంగోల్పురీలోని ఆక్రమణలను కూల్చేశాయి. దీనిపై నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్పందిస్తూ.. దక్షిణ ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ వద్ద ఉన్న అక్రమ కట్టడాలను కూడా తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. అయితే ఈ కూల్చివేతను ఆప్ ఎమ్మెల్యే ముకేష్ అహ్లావత్ ఖండిస్తూ నిరసనకు దిగారు. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.