గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున నామినేషన్ వేసిన ఓ అభ్యర్ధి నిన్న కిడ్నాప్ అయ్యాడు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆప్ నాయకుడు సిసోడియా.. బిజెపినే టార్గెట్ చేస్తూ.. కమలం శ్రేణులే మా అభ్యర్ధి కంచన్ జరివాలాను కిడ్నాప్ చేసి, నామినేషన్ వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన కొద్ది నిమిషాలకే ఆ అభ్యర్ధి ఆచూకీ దొరికిందంటూ ఆప్ నాయకులు వివరణ ఇచ్చారు. కంచన్ సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి నామినేషన్ ను వేశారు.