మిస్టర్ 360 డివిలియర్స్ తిరిగి తన రెండో హోంటౌన్ బెంగళూరుకు తిరిగి ఆడతానని ప్రకటించాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐపిఎల్లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తానని ఈరోజు ప్రకటించాడు. అయితే అతడు ఆటగాడిగా వస్తాడా? లేదా సపోర్టింగ్ స్టాఫ్గా జట్టుకు సేవలందిస్తాడా అన్నది వివరించలేదు. అయితే ఎబిడి ప్రకటనపై అతడి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సైతం డేనిష్ సెయిట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎబిడి పునరాగమనంపై హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.