రాహుల్ గాంధీ చేస్తున్న దేశవ్యాప్త ‘భారత్ జోడో యాత్ర’ లో దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూడా భాగం కానున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కూడా అయిన కమల్.. రాహుల్ ఆహ్వానం మేరకు ఈ యాత్రలో కమల్ తో కలిసి ఈనెల 24న నడనున్నారు. అప్పటికి ఈ యాత్ర రాజస్థాన్ ను దాటి ఢిల్లీలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఈ యాత్రకు 8 రోజుల విశ్రాంతిని ఇవ్వనున్నారు. ఆపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ లలో పర్యటించి జమ్మూ కశ్మీర్ లోకి ప్రవేశిస్తుంది.