తమిళ సీనియర్ నటుడు, నిర్మాత టి.రాజేందర్ తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు ఐసియులో చికిత్స కొనసాగుతోందని కోలీవుడ్ మీడియా పేర్కొంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆరోగ్యం ఈరోజు మరింత క్షీణించడంతో ఐసియులో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే అతడిని సింగపూర్కు తరలించాలని కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారు. అతడి కొడుకు, నటుడు శింబు సైతం రాజేందర్తో సింగపూర్ వెళ్ళనున్నారు.