ఆ తల్లిదండ్రులకు నేను రెండో కొడుకుని

By udayam on May 19th / 10:14 am IST

ముంబై ఉగ్రదాడుల్లో కన్నుమూసిన మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్​ తల్లిదండ్రులకు తాను రెండో కొడుకు లాంటివాడినని నటుడు అడవి శేష్​ చెప్పుకొచ్చాడు. ఉన్ని కృష్ణన్​ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్​’ చిత్రం విడుదల సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్లలో శేష్​ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘వాళ్ళను నేను ఒకే ఒక్కసారి కలిశా. అంకుల్​ నన్ను పలుమార్లు కౌగిలించుకున్నారు. నేను నిజ జీవితంలో మేజర్​ను కాలేను. కానీ ఈ దంపతులకు రెండో కొడుకును అవుతా’ అని చెప్పాడు.

ట్యాగ్స్​