మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన అడవి శేష్ చిత్రం ‘మేజర్’ సెన్సార్ పూర్తి చేసుకుంది. 26/11 ముంబై దాడుల్లో అమరుడైన ఆర్మీ ఆఫీసర్గా శేష్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు. జూన్ 3న ఈ చిత్రం ధియేటర్లలోకి విడుదల కానుంది. సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ అయింది. మేజర్ సందీప్గా శేష్ నటన అద్భుతమని సెన్సార్ బోర్డ్ వర్గాలు ప్రశంసించాయి.