క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం మహారాష్ట్ర ఇచ్చిన భూమిని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తిరిగిచ్చేశారు. 1989లో అప్పి మహారాష్ట్ర సర్కార్ బంద్రా శివార్లలోని ఓ ప్లాట్ను క్రికెట్ అకాడమీ ఏర్పాటు కోసం సునీల్ గవాస్కర్కు అందించింది. 33 ఏళ్ళు గడిచినా అక్కడ అకాడమీ ఏర్పాటు చేయకపోవడంపై గతేడాది విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మరోసారి సచిన్తో కలిసి అక్కడ అకాడమీ ఏర్పాటుకు ముందుకు రాగా ఆ ప్రణాళికా ఫలించకపోవడంతో భూమిని తిరిగి మహా సర్కార్కు అప్పగించేశారు.