కానిస్టేబుల్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు

By udayam on May 13th / 10:56 am IST

కశ్మీర్​ లోయలో సామాన్య ప్రజలపై ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న కశ్మీరీ పండిట్​ రాహుల్​ భట్​ను కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఈరోజు పోలీస్​ కానిస్టేబుల్​ రియాజ్​ అహ్మద్​ చోకర్​ను చంపేశారు. నిన్న జరిగిన కశ్మీరీ పండిట్​ హత్యపై ఆ రాష్ట్ర:లో తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలోనే కానిస్టేబుల్​ హత్యకు గురయ్యాడు. అహ్మద్​పై బుల్లెట్ల వర్షం కురిపించడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

ట్యాగ్స్​