ఏవియేషన్ కార్గో రంగంలో సూపర్ ట్రాన్స్ పోర్టర్ గా పేరు తెచ్చుకున్న ఎయిర్ బస్ బెలూగా తొలిసారిగా భారత్ లో ల్యాండ్ అయింది. సముద్రంలో తిరిగే బెలూగా వేల్ జాతి మూతి ఆకారంలో ఉండే ఈ భారీ కార్గో విమానం దేశ ఆర్ధిక రాజధాని ముంబై ఎయర్ పోర్ట్ లో మంగళవారం ల్యాండ్ అయింది. ముందుగా ఇది కోల్ కతా ఎయిర్ పోర్ట్ లోనూ ల్యాండ్ అయి ఫ్యూయల్ నింపుకుని ఆపై ముంబైకి చేరుకుంది. మిలటరీ, నేవీ, స్పేస్, మానవతా సాయం సెక్టార్లలో గూడ్స్ ను ఇది తరలిస్తుంది.