దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలకు శుక్రవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొబైల్, డెస్క్టాప్ యూజర్లు ఇంటర్నెట్కు చాలాసేపు కనెక్ట్ కాలేకపోయారు. ఈ ఔటేజ్ను డౌన్డిటెక్టర్.కామ్ వెబ్సైట్ కూడా గుర్తించింది. దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్లకు ఇంటర్నెట్ సేవలు రద్దయ్యాయని తెలిపింది. హైదరాబాద్తో సహా ఢిల్లీ–ఎన్సిఆర్, ముంబై, బెంగళూరు, జైపూర్తో పాటు పలు పెద్ద నగరాల్లో ఈ సేవలు చాలా సేపు ఆగిపోయాయి.